గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తా : వంశీకృష్ణ

గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తా : వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు: నల్లమల ప్రాంతంలో వెనకబడిన గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్​ వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో సేవాలాల్​ జయంతిని నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ తీశారు. బంజారా యువతులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ గిరిజనులతో కలిసి డ్యాన్స్​ చేశారు. 

అనంతరం గిరిజన భవన్​ వద్ద నిర్వహించిన భోగ్ భండార్​లో పాల్గొని పూజలు చేశారు. లచ్చునాయక్, దగ్నా నాయక్, బీచ్యానాయక్, మోహన్​లాల్, గోపాల్ నాయక్, చంతూ నాయక్, శ్రీరాం నాయక్, రాములు నాయక్, దేశ్యానాయక్, రాజగోపాల్, భరత్, రాంబాబు నాయక్, మంత్ర్యా నాయక్, భాస్కర్​​పాల్గొన్నారు. 

మార్కెట్​లో అన్నదానం ప్రారంభం

రైతుల ఆకలి తీర్చేందుకే మార్కెట్​లో రైతులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. సీబీఎం ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వేరుశనగ రైతులు మార్కెట్ కు వచ్చి పస్తులు ఉండవద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్కెట్​ సెక్రటరీ నర్సింహా,  కౌన్సిలర్లు గౌరీశంకర్, సునీత, శారద, ఆకుల లావణ్య, రాజేందర్, వెంకటేశ్, రామనాథం పాల్గొన్నారు.