జూబ్లీహిల్స్,వెలుగు: జాబ్ వచ్చినందుకు ఫ్రెండ్స్కు పార్టీ ఇచ్చి వెళ్తూ.. కారుతో ఓ యువకుడిని ఢీకొట్టిన హిట్అండ్రన్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. జూబ్లీహిల్స్ఏసీపీ కె.హరిప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. సికింద్రాబాద్ఏరియా తుకారాంగేట్కు చెందిన కొవ్వూరి రుత్విక్రెడ్డి(21)కి ఇటీవల అమెజాన్సంస్థలోజాబ్ వచ్చింది. తన ఫ్రెండ్స్ అయిన విద్యార్థి వైష్ణవి (23), లాలాపేటకు చెందిన పోల్సాని లోకేశ్వరరావు(21) మౌలాలికి చెందిన విద్యార్థి బుల్లా అభిలాష్(20) వెస్ట్మారేడ్పల్లికి చెందిన ప్రయివేట్ఉద్యోగి మెగదామ్పల్లె అనికేత్(22) కు పార్టీ ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు.
రిత్విక్ రెడ్డి తన బావ నాగచరణ్రెడ్డి వెర్నా కారును (టీఎస్08 ఎఫ్ఎన్6663) తీసుకుని మంగళవారం సాయంత్రం ఫ్రెండ్స్ తో బయలు దేరాడు. మార్గం మధ్యలో తుకారాంగేట్వద్ద కల్యాణి బార్లో నాలుగు బీర్లు తీసుకుని వాటిని తాగుతూ గచ్చిబౌలి, దుర్గం చెరువు, అమెజాన్ కంపెనీ ఏరియా తదితర ప్రాంతాల్లో తిరిగారు. బుధవారం తెల్లవారుజాము 4 గంటలకు మాదాపూర్వివేకానందనగర్ లో 4 ఏఎంలో హోటల్ లో బిర్యానీ తిన్నారు. తాగిన మత్తులో రిత్విక్ రెడ్డి కారును స్పీడ్ గా నడిపి ముందుగా వెళ్తున్న బైక్ ను ఢీకొట్టగా.. దానిపై నుంచి తారక్రామ్, రాజు గాలిలో పల్టీలు కొట్టి కిందపడిపోగా ఒకరు చనిపోయారు. అయితే.. కారు ఆపకుండా తుకారాం గేటుకు వెళ్లిపోయారు.
యాక్సిడెంట్ పై రిత్విక్ రెడ్డి తన ఫ్రెండ్ గుడిమెట్లసురేశ్ రెడ్డికి తెలిపాడు. మరో కారులో ఫ్రెండ్స్ ను ఇళ్లకు పంపించారు. సురేష్రెడ్డి ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాడు. అక్కడి ఏమి జరుగుతుందో చూసి వెళ్లిపోయాడు. సమాచారం మేరకు నిందితులు మైత్రీవనం, ఏస్సార్నగర్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డీఐ వీరశేఖర్అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. తాగి కారు నడిపి యాక్సిడెంట్చేసిన రుత్విక్రెడ్డిని (ఏ1)గా ఫ్రెండ్స్ పైనా కేసులు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
