ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు

శివ్వంపేట, వెలుగు : ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శివ్వంపేట తహసీల్దార్ శ్రీనివాస్ చారి హెచ్చరించారు.  మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 19లో కలెక్టర్​ ఆదేశాల మేరకు జర్నలిస్ట్​లకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు.

సదరు భూమి చుట్టూ కడీలు వేసి బౌండరీ ఫిక్స్ చేయగా దొంతి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు  కడీలను తొలగించారు. ఈ విషయంపై జర్నలిస్టులు తహసీల్దార్‌‌కు ఫిర్యాదు చేయగా.. గురువారం ఆ స్థలాన్ని  పరిశీలించారు.  అనంతరం కడీలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సై రవికాంతరావుకు ఫిర్యాదు చేశారు.