సినిమా టికెట్ కోసం క్యూలైన్ లో మహేశ్ బాబు

సినిమా టికెట్ కోసం క్యూలైన్ లో మహేశ్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను సరికొత్తగా అలరిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. తాజాగా సినిమా టికెట్ కోసం జనం మధ్య క్యూలో నిలబడ్డారు. అవును.. మీరు వింటున్నది నిజమే.. మొన్న సర్కారు వారి పాట సినిమా ఈవెంట్ లోనూ ఎప్పుడూ డ్యాన్స్ జోలికి పోని మహేశ్.. తమన్ తో కలిసి చిందేశారు. దాన్ని మర్చిపోకముందే ఎవరూ ఎరుగని రీతిలో మరో పని చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఇక వివరాల్లోకి వెళితే... మహేశ్ నిజంగానే క్యూలో నిలబడ్డారా అంటే .. అవును. కానీ అది ఆయన రీసెంట్ గా నిర్మించిన మేజర్ సినిమా ప్రచారంలో భాగంగా అలా చేశారు. ఆ క్రమంలోనే ఓ థియేటర్ ముందు అప్పటికే క్యూ లైన్ లో నిల్చున్న నిహారిక ముందుకు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఆమెకు చిరాకు తెప్పిస్తారు. అప్పుడే నటుడు అడివి శేష్ కూడా రావడంతో వారిద్దరి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంటుంది. అంతలోనే మహేశ్ బాబు వచ్చి లైన్ లో నిలబడతారు. అతన్ని చూడగానే నిహారిక ఆశ్చర్యపోయి.. మా స్నేహితుల్ని కూడా పిలవొచ్చా అని అడుగుతుంది. దానికి మహేశ్ ఓకే అంటారు. దాంతో మళ్లీ లైన్ పెరుగుతుందు. మహేశ్ ని, నిహారిక ఫోన్ నెంబర్ అడిగేలోపు అక్కడ్నుంచి వెళ్లిపోవడం ఆమె అసహనం వ్యక్తం చేస్తుంది. ఈ ముగ్గురి మధ్య జరిగే ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన సోల్జర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అడివి శేశ్ ప్రధాన పాత్ర పోషించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ జూన్ 3న తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

 

 

మరిన్ని వార్తల కోసం..

నేచురల్​గా సమస్యల్ని తగ్గించుకోవాలి

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ప్రేక్షకులూ రికార్డు కొట్టిన్రు..