మరో మల్టీస్టారర్?

మరో మల్టీస్టారర్?

డిఫరెంట్‌‌గా ఉండే సబ్జెక్ట్స్‌‌ ఎంచుకోవడమే కాదు.. ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి కూడా ఎప్పుడూ ముందుంటారు నాగార్జున. తెలుగులోనే కాదు.. బాలీవుడ్‌‌లో కూడా మల్టీస్టారర్స్‌‌ చేశారాయన. ప్రస్తుతం అమితాబ్, రణబీర్ కపూర్‌‌‌‌లతో కలిసి ‘బ్రహ్మాస్త్ర’లో కూడా నటిస్తున్నారు. ఇప్పుడు తమిళంలోనూ మల్టీస్టారర్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఏడాది కిందట  ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ భారీ చిత్రంలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించారు నాగ్. ఇది ధనుష్  డ్రీమ్ ప్రాజెక్ట్. ‘రుద్ర’ పేరుతో తెరకెక్కించాలనుకున్నాడు కానీ అతని బిజీ షెడ్యూల్ కారణంగా బ్రేక్ ఇచ్చాడు. అయితే లాక్ డౌన్ టైమ్‌‌లో తీరిక చిక్కడంతో ఆ స్క్రిప్టు మీద మళ్లీ దృష్టి పెట్టాడట. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తవగానే ఈ చిత్రాన్ని సెట్స్‌‌కి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడని కోలీవుడ్ టాక్. నాగార్జున, అదితీరావు హైదరిలతో పాటు శరత్‌‌ కుమార్‌‌, ఎస్‌‌జే సూర్య కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి నాగ్ చేయాల్సిన పాత్రకి ముందు రజినీకాంత్‌‌ని అనుకున్నాడట ధనుష్​. కానీ ఆయన చేసే అవకాశం లేకపోవడంతో నాగ్ అయితే కరెక్టని ఫిక్సయ్యాడట. నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ మూవీతో బిజీగా ఉన్నారు. ఇందులో ఎన్‌‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారాయన. హైదరాబాద్‌‌లో ఒక షెడ్యూల్ పూర్తయింది.  నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌‌లాండ్‌‌లో ప్లాన్ చేశారు. కానీ కరోనా  తీవ్రత ఎక్కువవడంతో అక్కడికి వెళ్లకూడదని, అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి పూర్తి చేద్దామని నిర్ణయించుకున్నారని సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాని ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

For More News..

సన్‌‌రైజర్స్‌‌ ఆటగాళ్లు సారీ చెప్పాలి

హైకోర్టు చెప్పినా వినట్లే