వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు ప్రధాని మోడీకి ప్రముఖ నటుడు సోనూసూద్ ధన్యవాదాలు తెలిపారు. రైతులు శాంతియుతంగా నిరసనలు తెలిపినందుకు వారికి కూడా ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులు తమ ఇళ్లకు వచ్చి గురునానక్ జయంతిని సంతోషంగా జరుపుకోవాలని ఆయన అన్నారు.
ఇదొక అద్భుతమైన వార్త! వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు ధన్యవాదాలు నరేంద్రమోదీ జీ. శాంతియుత నిరసనల ద్వారా న్యాయమైన డిమాండ్లను లేవనెత్తినందుకు రైతులకు ధన్యవాదాలు. ఈ రోజు శ్రీ గురునానక్ దేవ్ జీ యొక్క ప్రకాష్ పురబ్లో రైతులు తమ కుటుంబాలతో కలిసి జరుపుకోవడానికి సంతోషంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను’ అని సోనూసూద్ ట్వీట్ చేశారు.
This is a wonderful news!
— sonu sood (@SonuSood) November 19, 2021
Thank you,@narendramodi ji, @PMOIndia, for taking back the farm laws. Thank you, farmers, for raising just demands through peaceful protests. Hope you will happily return to be with your families on the Parkash Purab of Sri Guru Nanak Dev Ji today.