Suriya: అభిమానులను పిలిచి భోజనాలు పెట్టిన సూర్య..నెటిజన్స్ ఫిదా

Suriya: అభిమానులను పిలిచి భోజనాలు పెట్టిన సూర్య..నెటిజన్స్ ఫిదా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) మంచి మనసుకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా సూర్య తన అభిమానులను పిలిచి అన్నదాన కార్యకమాన్ని నిర్వహించారు. ఎప్పుడు ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండే సూర్యకి..ఆ ఫ్యాన్స్ కూడా అతను చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు ఆసరా అవుతుంటారు. 

గతేడాది తమిళనాడులో భారీగా వర్షాలు కురవడం వల్ల ఎంతో మంది రోడ్డున పడ్డారు. చెన్నై మొత్తం నీటమునిగిపోవడం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో వరదబాధితులను ఆదుకునేందుకు హీరో సూర్య , అతని సోదరుడు కార్తీ రూ.10లక్షల రూపాయిల ఆర్థిక సాయన్నీ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, ఆ పరిస్థితుల నుంచి కొంతైనా బయట పడేవరకు అందరికీ నిత్య అన్నదానం చేస్తానని కూడా తెలిపారు. ఇక అదే సమయంలో తన ఫ్యాన్స్..వరద నీటిలో తిరిగి ఎంతోమందికి సహాయపడ్డారు.అందుకే ఇప్పుడు సూర్య వారికి స్వయంగా ఫోన్ చేసి మరి ఆహ్వానించి ఒక గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు.

హీరో సూర్య తాజాగా తన ఫ్యాన్స్ ను పిలిచి..పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైలోని త్యాగరాయర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాలులో, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లోని తన అభిమానులందరికీ శాఖాహార విందును ఏర్పాటు చేశారు. అంతేకాదు..తానే స్వయంగా ఫ్యాన్స్ కు భోజనం వడ్డించాడు.

ప్రస్తుతం సినిమాల్లో స్టార్ స్టేటస్ లో ఉన్న సూర్య..తన బిజీ షెడ్యూల్ లో కూడా..ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ..ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ఉండటం మాములు విషయం కాదు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌లను సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంటున్నసూర్య..త్వరలో ‘కంగువ’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.