వీరాభిమాని మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య

వీరాభిమాని మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య

హీరో సూర్య(Suriya) కన్నీళ్లు పెట్టుకున్నాడు. సూర్య వీరాభిమాని అరవింద్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇది తెలుసుకున్న సూర్య చెన్నై లోని ఎన్నూర్ లో గల అభిమాని ఇంటికి వెళ్ళి అతని కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పాడు. అరవింద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇస్తూ..అరవింద్ మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 

సూర్య ఫ్యాన్ క్లబ్ సభ్యుడిగా అరవింద్ ఎంతో చురుకుగా ఉంటూ సేవ కార్యక్రమంలో పాల్గొనేవాడని సమాచారం. సూర్య నేరుగా అభిమాని ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి..అనంతరం అరవింద్ చిత్రపటానికి నివాళులర్పించారు.

ALSO READ: Chandramukhi 2 Review: చంద్రముఖి 2 మూవీ రివ్యూ
 

హీరో సూర్య రియల్ లైఫ్ లోను సామజిక కార్యక్రమాలు చేస్తూ..అభిమానులకి ఆండగా ఉంటారు. సూర్య అగరం ఫౌండేషన్‌ని స్థాపించి విద్యా,వైద్య సహాయాలు చేస్తుంటాడు. దీంతో సూర్య ఫ్యాన్స్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. 

 

ప్రస్తుతం శివ డైరెక్షన్ లో  కంగువ మూవీలో నటిస్తున్నారు. సూర్య నటిస్తోన్న 42వ చిత్రమిది. దిశా పటాని హీరోయిన్. యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది పది భాషల్లో త్రీడీలో రిలీజ్‌‌‌‌ కానుంది.