రక్తం కారేదాకా వదలలేదు..రాధా రామ పాత్ర కష్టాలు తెలిపిన శ్రియా రెడ్డి

రక్తం కారేదాకా వదలలేదు..రాధా రామ పాత్ర కష్టాలు తెలిపిన శ్రియా రెడ్డి

స‌లార్ (Salaar) లో వ‌ర‌ద‌రాజు సోద‌రి పాత్రలో శ్రియా రెడ్డి (Shriya Reddy) అద‌ర‌గొట్టేసింది. సినిమాలో ఆమె లుక్కి..న‌ట‌న‌కి మంచి మార్కులే ప‌డ్డాయి. కొందరైతే శ్రియా రెడ్డి పాత్రని 'బాహుబ‌లి' సినిమాలో ర‌మ్యకృష్ణ చేసిన శివ‌గామి పాత్రతో పోల్చుతున్నారు. దీంతో శ్రియా రెడ్డి పేరు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. 

లేటెస్ట్గా శ్రియ రెడ్డి సలార్లో పోషించిన రాధా రామ పాత్ర తనకి మంచి గుర్తింపు తెచ్చిందని..అంతేకాకుండా నన్ను ఆసుపత్రి పాలు చేసిందని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకుంది. రాధా రామ పాత్ర పోషించిన పాత్ర కోసం పెద్దపెద్ద చెవి కమ్మలు పెట్టుకోవాల్సి వచ్చింది. అలా పెట్టుకున్నందుకు నా చెవులు మొత్తం చీరుకుపోయాయని..బ్లడ్ కారిన షూటింగ్ లోనే ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇక వెంటనే షూటింగ్ కంప్లీట్ అయ్యాక హాస్పిటల్కి వెళ్లి సర్జరీ (Surgery) కూడా చేయించుకోవలసి వచ్చింది.

అంతేకాకుండా సలార్ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఆర్టిస్టులందరినీ డార్క్ కలర్స్ లో చూపించారు. అయితే కాస్ట్యూమ్స్ విషయంలో నేను డార్క్ కలర్ లోని  బట్టలు వేసుకోనని చెప్పా..కానీ, డైరెక్టర్ వేసుకోమని ఎంత చెప్పిన..వినకుండా నేను మాత్రం ఎల్లో కలర్ రంగు సారీనే కట్టుకున్నాను అంటూ శ్రియా రెడ్డి  ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే శ్రియా రెడ్డిని చాలా మంది కొత్త న‌టి అనుకుంటున్నారు. కానీ ఆమె చాలా ఏళ్ల క్రితమే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2002 లోనే స‌మురాయ్ అనే సినిమాతో త‌మిళ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత అప్పుడప్పుడు అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఆరంగ్రేటం చేసింది. 'అమ్మ చెప్పింది' సినిమాలోనూ నటించింది.

శ్రియా రెడ్డి మ‌ల‌యాళంలోనూ సినిమాలు చేసింది. ఇవేవి అంత గుర్తింపు తీసుకురాలేదు. ఇక విశాల్తో న‌టించిన 'పొగరు' సినిమాతో మాత్రం న‌టిగా బాగా ఫేమ‌స్ అయింది. ప్రస్తుతం పవన్ OG సినిమాలో ఒక కీలకమైన పాత్ర లో నటిస్తోంది. ఈమె హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణ భార్య.