నటనను పక్కన పెట్టేసిన శ్రుతీ హాసన్

నటనను పక్కన పెట్టేసిన శ్రుతీ హాసన్

మనసంతా మ్యూజిక్‌‌‌‌పైనే ఉందంటూ నటనను పక్కన పెట్టేసిన శ్రుతీ హాసన్.. కొన్నేళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఒక్కో సినిమానీ బ్యాగ్‌‌‌‌లో వేసుకుంటూ నటిగా తన ప్రయాణాన్ని కంటిన్యూ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడైతే పూర్తిగా రూటు మార్చేసింది. తమిళ, తెలుగు చిత్రాలతో పాటు హాలీవుడ్ సినిమాల పైనా కన్నేసింది. ఆల్రెడీ ‘ట్రెడ్‌‌‌‌స్టోన్‌‌‌‌’ అనే టెలివిజన్ సిరీస్‌‌‌‌ చేసిన శ్రుతి.. ఇప్పుడు ‘ద ఐ’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో నటించడానికి రెడీ అవుతోంది. ‘ద లాస్ట్ కింగ్‌‌‌‌డమ్’ ఫేమ్ మార్క్ రౌలీ ఆమెకి జోడీగా నటిస్తున్నాడు.

వర్క్‌‌‌‌షాప్స్​లో పాల్గొనడానికి రీసెంట్‌‌‌‌గా గ్రీస్‌‌‌‌ వెళ్లిన శ్రుతి.. ఈ ప్రాజెక్ట్ తనకి చాలా స్పెషల్ అని, ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయడం ఎక్సయిటింగ్‌‌‌‌గా ఉందని సోషల్ మీడియాలో తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఇది ఒక యువతి కథ. తన భర్త అస్థికల్ని తీసుకుని అతను చనిపోయిన ఐల్యాండ్‌‌‌‌కి వెళ్తుందామె. కొన్ని చర్యల ద్వారా తన భర్తని తిరిగి పొందవచ్చని ఆమెకి తెలుస్తుంది. దాంతో వెళ్లకూడని దారిలో వెళ్లి చిక్కుల్లో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. అతి త్వరలో  షూట్ మొదలు కానుంది. వచ్చే యేడు సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఓవైపు తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్‌‌‌‌ లాంటి స్టార్ హీరోలతో వర్క్ చేస్తూ ఫుల్‌‌‌‌ బిజీగా ఉన్న శ్రుతి.. హాలీవుడ్‌‌‌‌లో కూడా బిజీ అవడం నిజంగా విశేషమే.