
న్యూఢిల్లీ: అదానీ ఆడిటర్లలో ఒకరైన ఎస్ ఆర్ బాట్లిబాయ్పై నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) ఎంక్వయిరీ మొదలుపెట్టింది. చాలా కాలంగా బాట్లిబాయ్ అదానీ గ్రూప్కు ఆడిటర్గా కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గౌతమ్ అదానీ నాయకత్వంలోని కొన్ని గ్రూప్ కంపెనీతో 2014 నుంచీ నిర్వహించిన సంభాషణల వివరాలను తెలియచేయాలని ఎస్ఆర్ బాట్లిబాయ్ను ఎన్ఎఫ్ఆర్ఏ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎస్ఆర్ బాట్లిబాయ్ ఈవై ఇండియా మెంబర్గా వ్యవహరిస్తోంది. ఈ ఎంక్వయిరీకి ఎంత టైము పడుతుందనేది ఇంకా తెలియలేదు. అలాగే, ఆ తర్వాత ఆడిటర్, అదానీ కంపెనీలపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేదీ స్పష్టం కాలేదు. ఎన్ఎఫ్ఆర్ఏ, అదానీ గ్రూప్ కంపెనీల ప్రతినిధులు ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు బదులివ్వలేదు.
ఈవై, ఎస్ ఆర్ బాట్లిబాయ్సంస్థల ప్రతినిధులు సమాధానం ఇవ్వడానికి తిరస్కరించారు. అదానీ గ్రూప్ రెవెన్యూలో సగ భాగం తెచ్చే అయిదు లిస్టెడ్ కంపెనీలకు ఎస్ ఆర్ బాట్లిబాయ్ సంస్థ ఆడిటర్గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ఈ ఏడాది జనవరి నెలలో అదానీ గ్రూప్పై చేసిన ఆరోపణల నేపథ్యంలో తాజా ఎన్ఎఫ్ఆర్ఏ ఎంక్వయిరీ ప్రాధాన్యం సంతరించుకుంది. హిండెన్బర్గ్ ఆరోపణలన్నీ అబద్దాలని, ఉద్దేశపూర్వకంగా చేసినవేనని జనవరి నుంచీ అనేకసార్లు అదానీ గ్రూప్ వాటిని తిప్పి కొట్టే ప్రయత్నాలు చేస్తోంది.