న్యూఢిల్లీ: సిటీ గ్యాస్ ప్రాజెక్టుల విస్తరణ కోసం రాబోయే పదేళ్లలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అదానీ టోటల్ గ్యాస్ ప్లాన్ చేస్తోంది. సీఎన్జీ రిటెయిలింగ్, ఇండ్లకు, పరిశ్రమలకు పైప్ల ద్వారా అందించడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భారీగా పెంచాలనుకుంటున్నట్లు కంపెనీ సీఎఫ్ఓ వెల్లడించారు. దేశంలోని 124 జిల్లాలలో పైప్లైన్ ద్వారా ఇండ్లలోని కిచెన్లకు, సీఎన్జీ రిటెయిలింగ్ కోసమూ 52 లైసెన్సులను కంపెనీ పొందింది. కుకింగ్ గ్యాస్ సరఫరా బిజినెస్కు 7 లక్షల మంది కన్జూమర్లను అదానీ టోటల్ గ్యాస్ సంపాదించుకుంది.
460 సీఎన్జీ స్టేషన్లను ఇప్పటికే కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ల సంఖ్యను పెంచాలనేదే కంపెనీ ఆలోచన. 2022–23 ఫైనాన్షియల్ ఇయర్లో అదనపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం కంపెనీ రూ. 1,150 కోట్లను వెచ్చించినట్లు సీఎఫ్ఓ పరాగ్ పారిఖ్ వెల్లడించారు. గ్యాస్ బిజినెస్భవిష్యత్ మరింత బాగుంటుందని కంపెనీ అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. స్టీల్ పైప్లైన్ఏర్పాటును మరింత వేగంగా పూర్తి చేయడంతోపాటు, తమకు లైసెన్సు ఉన్న ప్రాంతాలలో కొత్తగా 1,800 సీఎన్జీ స్టేషన్లను నెలకొల్పాలనుకుంటున్నట్లు సీఈఓ సురేష్ పీ మంగ్లాని వెల్లడించారు.