బోధన్ పట్టణంలో .. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు

బోధన్ పట్టణంలో .. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు
  • అడిషనల్​కలెక్టర్​ అంకిత్​ 

బోధన్​,వెలుగు : బోధన్​ పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని అడిషనల్​కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సోమవారం బోధన్ మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులపై సబ్​ కలెక్టర్​ వికాస్ మహతో కలిసి మున్సిపల్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై వార్డుల వారీగా వివరాలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాప్యం చేయొద్దన్నారు. పట్టణంలో చేపట్టిన  కల్వర్టుల నాణ్యత పనులపై ఇంజినీరింగ్​ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  మున్సిపల్​ కమిషనర్​ జాదవ్​ కృష్ణ, ఇంజినీరింగ్​ అధికారులు పాల్టొన్నారు. 


ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి


స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్​కలెక్టర్ అంకిత్​ సూచించారు. సోమవారం బోధన్ లోని లయన్స్​ క్లబ్​ హాల్​లో  ప్రొసీడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు.  ఎన్నికల కమిషన్​ సూచించిన నిబంధనలు పాటించాలన్నారు. పోలింగ్​ సమ యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.  సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో,  బోధన్​, సాలూర, ఎడపల్లి, రెంజల్ మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ప్రొసిడింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.