
గద్వాల టౌన్, వెలుగు: తప్పులు లేకుండా ఓటర్ జాబితాను తయారు చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. గురువారం ఎంఏఎల్డీ కాలేజీలో గద్వాల నియోజకవర్గంలోని బూత్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బీఎల్వోల పాత్ర కీలకమని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ మల్లికార్జున్, మాస్టర్ ట్రైనర్ అశోక్, నరేశ్, సీనియర్ అసిస్టెంట్ నగేశ్, బీఎల్వోలు పాల్గొన్నారు.
కోడేరు: పెద్దకొత్తపల్లి హైస్కూల్ లో గురువారం బీఎల్వోలకు శిక్షణ ఇచ్చారు. ఆర్డీవో బన్సీలాల్ హాజరై ఓటర్ల నమోదు, చనిపోయిన వారిని డిలీట్ చేయడం,పేర్లలో తప్పొప్పులు సరి చేయడంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తహసీల్దార్ ఎం. శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్, రఘువర్ధన్ రెడ్డి, 57 మంది బీఎల్వోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.