
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న పులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట పొలాలకు వెళ్ళే రైతులు, కూలీలు వ్యవసాయ పనుల కోసం పంట చేన్లలోకి పోయ్యేందుకు జంకుతున్నారు. తాజాగా బోథ్ మండలం రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి ఠీవిగా నడుచుకుంటూ వెళుతుండగా అటుగా వెళుతున్న కొంతమంది యువకులు గమనించారు. పులుల సంచారం గురించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో వరుసగా రెండు రోజులు పెద్దపులి ఆవులను వేటాటి చంపింది. పశువుల కాపరులు అటవీ ప్రాంతానికి వెళ్లడానికి భయపడుతున్నారు. పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు టైగర్ ట్రాకింగ్ కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఆడపులి తోడు కోసం మగపులి తిరుగున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంతో సంచరిస్తున్న పెద్దపులి తిపేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిందని గుర్తించారు.