
- ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి
ఆదిలాబాద్టౌన్(జైనథ్), వెలుగు: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి, 12 బైక్ లను సీజ్ చేశారు. ఎస్పీ అఖిల్మహాజన్గురువారం జైనథ్ పోలీస్స్టేషన్ లో మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. జైనథ్కు చెందిన మద్దులవార్ రమేశ్ తన బైక్ చోరీ అయిందని కొద్ది రోజుల కింద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా బేల మండలానికి చెందిన బైక్మెకానిక్సుమిత్సకర్కార్ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని ఫ్రెండ్స్ షేక్ షకిల్, మరో బాలుడితో పాటు మహారాష్ట్రకు చెందిన కృష్ణతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
ఆదిలాబాద్, బేల, జైనథ్, కోర్పణ మండలాల్లో బైక్చోరీలు చేసి.. వాటి ఇంజన్లు మారుస్తూ ఇతరులకు అమ్ముతున్నారు. నిందితులు సుమిత్ సకర్కర్, కృష్ణ తాన్భా నఖతే, షేక్ షకీల్ను, కొనుగోలు చేసిన అబ్రార్ఖాన్, షేక్ ఇబ్రహీ హాజీమియా, సాయిలను అరెస్ట్ చేశారు. సలీమ్, బాలుడు పరారీలో ఉన్నట్టు చెప్పారు. కేసును ఛేదించిన జైనథ్ సీఐ డి.సాయినాథ్, ఎస్ఐ గౌతమ్, సిబ్బంది వికాస్, నరేశ్ను ఎస్పీ అభినందించారు.