కాగజ్ నగర్, వెలుగు: భూమి అమ్మకంలో మధ్యవర్తిగా ఉండి రూ.17 లక్షలు తీసుకుని మోగించిన వ్యకికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.కౌటాల మండలం బోదంపల్లికి చెందిన రామటెంకి ప్రకాశ్తనకు కాగజ్ నగర్ మండలం మాలిని గ్రామ శివారులో ఐదెకరాల పట్టా భూమి ఉందని కాగజ్నగర్కు చెందిన కృష్ణ అనే వ్యక్తిని నమ్మించి అతడి వద్ద నుంచి రూ.17 లక్షలు తీసుకున్నాడు.
అయితే ఆ తర్వాత తాను ఇచ్చిన డబ్బులకు భూమి చూపాలని కృష్ణ అడిగితే ప్రకాశ్ బెదిరింపులకు దిగాడు. దీనిపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశ్ మోసం చేసినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.
