బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్.. వరుసగా అదే రేంజ్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో భాగంగానే ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్లో అత్యంత భారీ బడ్జెట్తో ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కుతుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనుండగా.. సీత పాత్రలో ఫలానా హీరోయిన్ నటించబోతున్నదంటూ కొంతమంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఆ వార్తలన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ సీత పాత్రపై ఓ క్లారిటీ ఇచ్చాడు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్కు జోడిగా కృతి సనన్ నటిస్తుందని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. కృతి సనన్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ వన్ నేనోక్కడినే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్కు సోదరుడిగా.. అంటే రామునికి లక్ష్మణుడి పాత్రకు బాలీవుడ్ కు చెందిన యువ నటుడు సన్నీ సింగ్ పేరును ఖరారు చేశారు. సన్నీ సింగ్ “సోను కె టిటు కి స్వీటీ” అనే చిత్రంలో కనిపించాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. రాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ తన శరీరాన్ని అందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నాడని చిత్ర దర్శకుడు ఓమ్ రౌత్ వెల్లడించారు.