కేబినేట్‌‌‌‌లోకి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌ .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో మంత్రి పదవి

కేబినేట్‌‌‌‌లోకి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌ .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో మంత్రి పదవి
  • ఇప్పటికే ఇద్దరు మంత్రులు
  • అడ్లూరికి పదవితో మూడుకు చేరిన మంత్రుల సంఖ్య
  • కవ్వంపల్లికి వచ్చినట్టే వచ్చి చేజారిన మినిస్ట్రీ

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో మంత్రి పదవి దక్కింది. ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆదివారం మధ్యాహ్నం ఆయన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రిగా, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 తాజాగా అడ్లూరికి మంత్రి పదవి రావడంతో లక్ష్మణ కుమార్ తో కలిపి మంత్రుల సంఖ్య మూడుకు చేరింది. అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రిగా అవకాశం దక్కడంతో ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. 

జడ్పీటీసీ నుంచి మంత్రి దాకా..

పెద్దపల్లిలో 1968 ఏప్రిల్ 1న అడ్లూరి నాగయ్య, లక్ష్మి దంపతులకు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ జన్మించారు. పెద్దపల్లిలో ఇంటర్, ఐటీఐ చదివారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ  గోదావరిఖని జూనియర్ కాలేజీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ జనరల్ సెక్రటరీగా, కరీంనగర్ డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 

ఆ తర్వాత ధర్మారం జడ్పీటీసీగా మాజీ మంత్రి మాతంగి నర్సయ్యపై గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభజన తర్వాత ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 1,365 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటికే జడ్పీటీసీ గా ఉన్న ఆయన కరీంనగర్ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేశారు. తెలంగాణ వచ్చాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2018 నుంచి జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన చిరకాల ప్రత్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ధర్మపురి నుంచి 22,039 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత ప్రభుత్వ విప్ గా ఎన్నికయ్యారు. 

కవ్వంపల్లికి చేజారిన మంత్రి పదవి.. 

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో  మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చోటు దక్కుతుందని శనివారం రాత్రి దాకా ప్రచారం జరిగింది. మాదిగ సామాజికవర్గం నుంచి కవ్వంపల్లికి అవకాశం లభిస్తుందని భావించినప్పటికీ చివరి క్షణంలో ఆయనకు చుక్కెదురైంది. మంత్రి పదవి దక్కకపోవడంతో సంబురాలు చేసుకునేందుకు రెడీ అయిన  ఆయన అనుచరులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మొదటి నుంచి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలోనే ఉన్నారు. పదేండ్లు పార్టీ అధికారంలో లేకపోయినా, నాటి అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు వచ్చినా ఆయన పార్టీలోనే కొనసాగడం అడ్లూరి కలిసొచ్చింది.