- రేపటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ డిగ్రీ గురుకులాల్లో డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని టీజీయూజీసెట్ (తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) కన్వీనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఈ నెల 10 నుంచి జనవరి 10వ తేదీ వరకు అప్లికేషన్ సమర్పించవచ్చని పేర్కొన్నారు. జనవరి 23న ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. దరఖాస్తులను www.tswreis.ac.in, www.tgtgurukulam.telangana.gov.in వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని సూచించారు.