ఇంటి బాల్కనీ నుంచి ప్లైఓవర్ నిర్మాణం..8th వండర్ అంటున్న స్థానికులు

ఇంటి బాల్కనీ నుంచి ప్లైఓవర్ నిర్మాణం..8th వండర్ అంటున్న స్థానికులు

ఈమధ్య కాలంలో భోపాల్​ లో 90డిగ్రీస్​ కార్నర్​ఫ్లైఓవర్​గురించి విన్నాం..ఆ కోవకు చెందిన మరో ఫ్లైఓవర్ ఇప్పుడు నాగ్​పూర్​లో కూడా వెలుగులోకి వచ్చింది.. ఈ ఫ్లైఓవర్లు కట్టిన ఇంజనీర్ల ప్రతిభకు జనం వహ్వా..వహ్వా అంటున్నారు. ఈ ఫ్లైఓవర్ను 8th వండర్​గా చెప్పుకుంటున్నారు. 

మహారాష్ట్రలోని నాగ్​ పూర్​లో నిర్మాణంలో ఉన్న ఈ ప్లైఓవర్​ అశోక్​ చౌక్ సమీపంలో ఓ ఇంటి బాల్కనీ గుండా వెళ్తున్నట్లు గుర్తించడంతో అందిరి దృష్టిని ఆకర్షించింది. స్థానికులు దీనిని 8th వండర్​ అంటున్నారు. నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(NHAI), నాగ్పూర్​మున్సిపల్ కార్పొరేషన్​ఈ నిర్మాణాన్ని ఒకరి ఇంటిగుండా వెళ్లేందుకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నిస్తున్నారు. 

ఇల్లు అధికారికమైనదేనా.. అలా అయితే పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకోవాలి కదా..అనధికారికంగా ఉంటే ఎందుకు కూల్చలేదని అని అడుగుతున్నారు. 

150ఏళ్ల నాటిది ఆ ఇల్లు..

ఆ ఇల్లు..150 ఏళ్ల క్రితం నాటిదట.. ఆ ఇంటి యజమాని చెప్పినదాని ప్రకారం.. ఆరు తరాలుగా వారి కుటుంబం ఆ ఇంట్లో నివసిస్తోంది. ఇంటిని 25 సంవత్సరాల క్రితం పునరుద్ధరించారు. 

ఫ్లైఓవర్ నిర్మాణంలో తమ బాల్కనీని కూల్చేసినా ఇబ్బంది లేదని చెప్తున్నారు.  అయితే బాల్కనీకి అధికారిక పర్మిషన్​ ఉందా,ఇంటి ప్లాన్ ఆమోదించారా అని అడిగినప్పుడు వారు తప్పించుకునే సమాధానాలను ఇచ్చారు.

రూ. 998 కోట్ల మోసమా?

స్థానిక మీడియా ప్రకారం.. 9.2 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్‌ను NHAI ఆధ్వర్యంలో రూ.998 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ విషయం గురించి తాము ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్‌కు తెలియజేశామని అధికారులు చెబుతున్నారు. అనధికార నిర్మాణాన్ని కూల్చివేయడం నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత..కానీ అక్కడి అధికారులు ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు.ఇందులో భారీ కుంభకోణం జరిగి ఉండొచ్చని ప్రతిపక్ష కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తున్నారు.