పాక్ జట్టు ఫుడ్ ఎంజాయ్: నిన్న హైదరాబాద్ బిర్యానీ.. ఇవాళ బెంగళూరు కబాబ్స్

పాక్ జట్టు ఫుడ్ ఎంజాయ్: నిన్న హైదరాబాద్ బిర్యానీ.. ఇవాళ బెంగళూరు కబాబ్స్

పాక్ క్రికెటర్లు ప్రపంచ కప్ టూర్ సందర్బంగా ఇండియన్ ఫుడ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో బిర్యానీ స్పెషల్ ను తింటూ ఎంజాయ్ చేసిన పాక్ క్రికెట్ జట్టు సభ్యులు.. బెంగళూరు కబాబ్ ను తింటూ కనిపించారు. అక్టోబర్ 20న బెంగళూరులో ప్రపంచకప్ 18వ  మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ఆస్ర్టేలియాతో తలపడనుంది. ఇందుకోసం బెంగళూరు చేరుకున్న పాక్ జట్టు సభ్యులు అక్కడి ప్రత్యేక వంటక బెంగళూరు కబాబ్ ను తింటూ ఎంజాయ్ చేశారు. 

అంతకుముందు హైదరాబాద్ లో జ్యువెల్ ఆఫ్ నిజాం, పెషావర్ తో సహా పలు రెస్టారెంట్లలో విందును ఆస్వాదిస్తూ కనిపించారు మెన్ ఇన్ గ్రీన్ పాక్ క్రికెట్ జట్టు సభ్యులు. చూశారా ఇండియన్ వంటకాలంటే అందరికి అంత ఇష్టం. భారత్ తో ఐసీసీ ప్రపంచ కప్ మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ కు బయల్దేరే ముందు పాక జట్టు హైదరాబాద్ కు వచ్చింది. హైదరాబాద్ ఆతిథ్యాన్ని ప్రశంసించిన పాక్ జట్టులోని కొందరుసభ్యులు.. హైదరాబాద్ లో తిరుగుతుంటే.. రావల్పిండి వీధుల్లో జనం మధ్య తిరుగుతున్నట్లు అనిపించిందన్నారు.