
‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్కు భారత సైన్యం తగిన గుణపాఠం చెప్పడంతో సైనికులను నేరుగా కలిసి అభినందించేందుకు ప్రధాని మోదీ పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లారు. సైనికులను కలిసి అభినందించిన మోదీ వారితో ముచ్చటించారు. మంగళవారం ఉదయం అధంపూర్ ఎయిర్ బేస్కు చేరుకున్న ప్రధానికి ‘ఆపరేషన్ సిందూర్’ గురించి భారత వైమానిక దళ సైనికులు వివరించారు.
Earlier this morning, I went to AFS Adampur and met our brave air warriors and soldiers. It was a very special experience to be with those who epitomise courage, determination and fearlessness. India is eternally grateful to our armed forces for everything they do for our nation. pic.twitter.com/RYwfBfTrV2
— Narendra Modi (@narendramodi) May 13, 2025
అధంపూర్ ఎయిర్ బేస్లో ప్రధాని మోదీ దాదాపు గంటన్నరకు పైగా గడిపారు. ‘ఆపరేషన్ సిందూర్’లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) చూపిన తెగువను ప్రధాని కొనియాడారు. త్రిశూలం ముద్రించిన టోపీని ధరించి మోదీ అధంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లడం విశేషం.
VIDEO | Prime Minister Narendra Modi (@narendramodi) travelled to the Adampur air base in Punjab earlier today and interacted with air force personnel, who have been in the thick of action during the recent conflict with Pakistan.
— Press Trust of India (@PTI_News) May 13, 2025
The Prime Minister's visit comes after days of… pic.twitter.com/XrFzNJHnlN
పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్ పై దాడి చేశామని, ఎయిర్ బేస్ ధ్వంసమైందని పాక్ చేసిన ప్రచారం తప్పుడు ప్రచారమేనని ప్రధాని మోదీ విజిట్తో తేలిపోయింది. దేశంలోనే రెండో అతిపెద్ద వైమానిక స్థావరం అధంపూర్ ఎయిర్ బేస్. ఉత్తర్ ప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్ మన దేశంలోనే అతిపెద్ద వైమానిక స్థావరం.
Also Read : మోదీ అధ్యక్షతన హైలెవల్ భేటీలు
పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్ సందర్శించిన ప్రధాని మోదీ సైనికులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. మన దేశ సైనికులు చూపిస్తున్న ధైర్య సాహసాలకు, చేస్తున్న సేవకు ఇండియా ఎప్పటికీ రుణపడి ఉంటుందని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. తెగువ చూపి ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతం చేసిన సైనికులను కలుసుకోవడం తనకు ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చిందని ఆయన పోస్ట్ చేశారు.