రాజు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు

రాజు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్లలో చిన్నారిపై రేప్‌ చేసి, చంపేసిన రాజు..  పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డి అన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఈ రోజు ఉదయం రాజు డెడ్‌బాడీ దొరికిన విషయం తెలిసిందే. అతడి సూసైడ్‌తో ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పల్లా అన్నారు. అయితే టీఆర్‌‌ఎస్ ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, అందుకే రాష్ట్రంలో క్రైం రేట్ తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. అక్కడక్కడా నేరాలు జరిగినా పోలీసులు ఉక్కు పాదంతో అణచివేస్తున్నారని పల్లా అన్నారు.