సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి : ఏబీవీపీ నాయకులు

సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి : ఏబీవీపీ నాయకులు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడించారు. భారీ ర్యాలీగా తరలివచ్చిన ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముందు బైఠాయించారు. దీంతో కలెక్టరేట్ ప్రాంతమంతా హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. విద్యార్థులను అదుపుచేయడం కోసం పోలీసులు.. నాయకులను, కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఏబీవీపీ నాయకుడు సురేష్ కమల్ మాట్లాడుతూ విద్యార్థుల డిమాండ్స్ ని వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కుంభకోణంలో సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శులను కలెక్టర్ అనిత రమచద్రన్ వెంటనే బర్తరఫ్ చేయాలని,
పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వాళ్లు డిమాండ్ చేశారు.