అహ్మదాబాద్ విమానం క్రాష్ ఘటనలో 297 కు పెరిగిన మృతుల సంఖ్య.. పీఎం మోడీ పరామర్శ..

అహ్మదాబాద్ విమానం క్రాష్ ఘటనలో 297 కు పెరిగిన మృతుల సంఖ్య.. పీఎం మోడీ పరామర్శ..

అహ్మదాబాద్ విమానం క్రాష్ ఘటనతో దేశం ఉలిక్కి పడింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఘటన అయిన ఈ ప్లాన్ క్రాష్ పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తం చేశారు. శుక్రవారం ( జూన్ 13 ) నాటికి మృతుల సంఖ్య 297కు చేరినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్యా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనలో ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ రమేష్ ప్రాణాలతో బయట పడటం గమనార్హం. కాగా..  ప్రధాని మోడీ ఘటనాస్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు విశ్వాస్ రమేష్ తో ప్రత్యేకంగా మాట్లాడారు మోడీ.

విశ్వాస్‌తో ప్రధాని మోదీ కొద్దిసేపు మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర క్షతగాత్రులను కూడా పరామర్శించారు.  

ఘటనాస్థలాన్ని సందర్శించిన మోడీ ఎక్స్ వేదికగా తన స్పందన తెలిపారు.ఈ విధ్వంసం అత్యంత బాధాకరమని అభివర్ణించారు మోడీ. ఘటనాస్థలంలో  పనిచేస్తున్న అధికారులు, రెస్క్యూ బృందాలను ఆయన కలిశారు.ఈ ఊహించలేని విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి పట్ల దేశం మొత్తం సానుభూతి వ్యక్తం చేస్తోందంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.