నెక్స్ట్ క్యాంటమ్ ఓఎస్తో ఏఐ ప్లస్ స్మార్ట్‌‌ఫోన్లు

నెక్స్ట్ క్యాంటమ్ ఓఎస్తో ఏఐ ప్లస్ స్మార్ట్‌‌ఫోన్లు

హైదరాబాద్​, వెలుగు: దేశీయ స్మార్ట్​ఫోన్​ కంపెనీ ఏఐ ప్లస్ పల్స్, నోవా 5జీ మోడళ్లను లాంచ్​చేసింది. ఇవి పూర్తిగా దేశీయంగా డెవలప్​చేసిన నెక్స్ట్​క్యాంటమ్​ఓఎస్​ తో పనిచేస్తాయి. పల్స్​4జీ ధరలు రూ.ఐదు వేల నుంచి రూ.ఏడు వేల వరకు ఉంటాయి.

 నోవా 5జీ ధరలు రూ.ఎనిమిది వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటాయి. అమ్మకాలు ఈ నెల 12 నుంచి మొదలవుతాయి. వీటిలో 6.7-అంగుళాల డిస్‌‌ప్లే, 50-మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, 5,000 ఎంఏహెచ్​బ్యాటరీ,  18వాట్ల చార్జింగ్‌‌, యూనిసాక్​ ప్రాసెసర్​, 6జీబీ వరకు ర్యామ్​, 128 జీబీ వరకు స్టోరేజీ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.