
పద్మారావునగర్, వెలుగు: ప్రతి ఒక్క మహిళను వ్యాపారవేత్తగా మార్చడమే తన లక్ష్యమని ఎంసీఆర్ఎఫ్ చైర్మన్, టీపీసీసీ సభ్యుడు మర్రి ఆదిత్య రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని 6 డివిజన్లలో ఘనంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రామ్గోపాల్పేట్లోని ఓల్డ్ గాస్ మండీలో దాదాపు 100 మంది మహిళలకు ప్రెషర్ కుక్కర్లు పంపిణీ చేశారు. స్థానిక ఉప్పలమ్మ దేవాలయంలో అమ్మవారికి చీరలు సమర్పించారు.
ఆలయానికి సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు. విక్టోరియా రాణిగంజ్లో 240 మందికి నిత్యావసర సరకులు అందజేశారు. అంబేద్కర్ నగర్లో 300 మందికి టిఫిన్ బాక్సులు, యువతకు క్రికెట్ కిట్లు అందజేశారు. మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్ తరఫున వినూత్నమైన నైపుణ్య శిక్షణ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అనంతరం ఐడీహెచ్ కాలనీతో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. త్రికాల మనోజ్ కుమార్, ఎన్.విఠల్, డా.శివకుమార్ లాల్, వేద్ ప్రకాశ్ యాదవ్, చందు, చక్రం, సంజయ్ కుమార్, జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.