అమెరికాకు ఎయిరిండియా బ్లాక్ బాక్స్!

అమెరికాకు ఎయిరిండియా బ్లాక్ బాక్స్!
  • డ్యామేజీ కావడంతో డేటా రిట్రీవ్ కోసం పంపాలని కేంద్రం యోచన 

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇటీవల కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ బ్లాక్ బాక్స్ డ్యామేజీ అయింది. అందులోని డేటాను రిట్రీవ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు దాన్ని అమెరికాకు పంపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డుకు బ్లాక్‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌ను పంపే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ సందర్భంగా అన్ని ప్రొటోకాల్స్ పాటిస్తారని, బ్లాక్‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌ను తీసుకుని మన అధికారుల బృందం  అమెరికాకు వెళ్తుందని పేర్కొన్నాయి. 

ఫ్లైట్ రైట్ ఇంజిన్ మార్చినం: ఎయిరిండియా 

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రమాదానికి గురైన ఫ్లైట్ రైట్ ఇంజిన్‌‌‌‌‌‌‌‌ను ఈ ఏడాది మార్చిలోనే మార్చినట్టు ఎయిరిండియా వెల్లడించింది. ఆ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఇంజిన్‌‌‌‌‌‌‌‌ను కూడా ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో తనిఖీ చేసినట్టు తెలిపింది. క్రాష్‌‌‌‌‌‌‌‌ అయిన ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ను ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌ చేశామని, అందులో ఎలాంటి లోపాలు లేవని చెప్పింది. చివరిసారి 2023 జూన్‌‌‌‌‌‌‌‌లో పూర్తిస్థాయిలో ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్షన్ జరిగిందని, మళ్లీ ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేయాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎయిరిండియా ఎండీ క్యాంప్‌‌‌‌‌‌‌‌బెల్ విల్సన్ తెలిపారు. ఆయన గురువారం కస్టమర్లకు బహిరంగ లేఖ రాశారు. అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో క్రాష్ అయిన ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో ప్రమాదానికి ముందు లోపాలు లేవని పేర్కొన్నారు. ‘‘మా దగ్గర బోయింగ్ 787–8 డ్రీమ్‌‌‌‌‌‌‌‌లైనర్ ఫ్లైట్లు 32 ఉన్నాయి. వీటన్నింటినీ తనిఖీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే 26 విమానాల్లో తనిఖీలు ముగిశాయి. వాటన్నింటికీ క్లియరెన్స్ వచ్చింది” అని తెలిపారు.