
వెలుగు: ‘ఎయిర్ ఇండియా’ సంస్థ మార్చి 8(శుక్రవారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్నంగా విషెష్ చెప్తోంది. ఆ సంస్థ ఆధ్వర్యంలో నడిచే 12 అంతర్జాతీయ, 40 లోకల్ ఫ్లైట్లను కేవలం ఉమెన్ స్టాఫ్ తోనే నడుపనుంది. ఈ మేరకు ఆయా ఫ్లైట్లకు పైలట్లు, సిబ్బంది అందరూ ఉమెన్ ఉంటారని ప్రకటించింది.
ఢిల్లీ నుంచి సిడ్నీ, రోమ్, లండన్, షాంఘై, పారిస్, న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో, శాన్ఫ్రాన్సిస్కో , ముంబై నుంచి లండన్, న్యూయార్క్, నెవార్క్ కు వెళ్లే ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో, 40 లోకల్ ఫ్లైట్లలో పైలట్లు, క్యాబిన్ క్రూ అందరూ మహిళలే ఉంటారు. “ అంతర్జాతీయ, జాతీయ ఫ్లైట్లలో పనిచేస్తున్న మా ఉమెన్ స్టాఫ్ ను అభినందిస్తున్నాను. వారు శక్తిమంతమైన మహిళా మణులు” అని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ లోహని చెప్పా రు.