ఉత్తర భారతదేశంలో భారీగా తగ్గిన వాయు కాలుష్యం: నాసా

ఉత్తర భారతదేశంలో భారీగా తగ్గిన వాయు కాలుష్యం: నాసా

20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తర భారతదేశంలో వాయి కాలుష్యం భారీగా తగ్గిందని అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా తెలిపింది. కరోనా లాక్ డౌన్ కారణంగా కాలుష్య స్థాయులు ఒక్క సారిగా పడిపోయాయంది. ఈ విషయాన్ని తమ ఉపగ్రహాలు గుర్తించాయంది. లాక్ డౌన్ తో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని యూనివర్శిటీస్ స్పేస్ రీసర్చ్ అసోసియేషన్ (USRA) సైంటిస్ట్ పవన్ గుప్తా చెప్పారు. లాక్ డౌన్ ప్రారంభంలో వాయు కాలుష్యంలో తేడాను గుర్తించడం కష్టమైందన్నారు.

లాక్ డౌన్ మొదటి వారంలో కాలుష్యం తగ్గడాన్ని గుర్తించామని… అది వర్షం, లాక్ డౌన్ రెండింటి కలయికతో జరిగిందని చెప్పారు. మార్చి 27న ఉత్తరాదిలో భారీ వర్షం కురిసింది. దీంతో, గాల్లోని ఇతర కణాలు తగ్గిపోయాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాహనాల ప్రయాణాలు ఆగిపోవడంతో కాలుష్యం భారీగా తగ్గిందన్నారు.