న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్కు పోయిన ఏడాది డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,588 కోట్ల లాభం వచ్చింది. 2021 డిసెంబరు క్వార్టర్ లాభంతో పోలిస్తే ఇది రూ.91.5 శాతం పెరిగింది. పోర్ట్ఫోలియో అంతటా నిలకడైన పనితీరు అందించడం ద్వారా మొత్తం ఆదాయం సంవత్సరానికి దాదాపు 20 శాతం పెరిగి రూ. 35,804 కోట్లకు చేరుకుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘ఆదాయం సీక్వెన్షియల్గా 3.7 శాతం పెరిగింది. ఇబిటా మార్జిన్ 52 శాతానికి విస్తరించింది. ఈ క్వార్టర్లో 64 లక్షల మంది 4జీ కస్టమర్లను సంపాదించాం. ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 193 వరకు ఉంది. పోస్ట్పెయిడ్, ఎంటర్ప్రైజ్, హోం, అలాగే ఆఫ్రికా వ్యాపారం బాగున్నాయి. డీటీహెచ్ వ్యాపారం ఒత్తిడిలో ఉంది”అని సంస్థ ఎండీ గోపాల్ విఠల్ చెప్పారు. 2024 మార్చి నాటికి అన్ని పట్టణాలు, కీలకమైన గ్రామీణ ప్రాంతాలకు 5జీని తెస్తామని వెల్లడించారు.