
సౌత్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ మరోసారి చిక్కుల్లో పడింది. ఇటీవల పుష్ప సినిమాలో రష్మిక రోల్పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. దీంతో రష్మిక ఫ్యాన్స్ ఐశ్వర్యపై ఫైర్ అవుతున్నారు. మా హీరోయిన్నే అంటావా అంటూ ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. విషయం పెద్దదవుతుందని గ్రహించిన ఐశ్వర్య తాజాగా ఓ ప్రకటన చేసింది.
‘నేను రష్మికను ఏమీ అనలేదు. ఆమె అభిమానులు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. శ్రీవల్లి లాంటి పాత్రలు నాకు బాగా సెట్ అవుతాయని చెప్పాను. దాన్ని వారు.. రష్మిక కన్నా బాగా చేసుండేదాన్ని అన్నట్టుగా అర్థం చేసుకున్నారు. తన వర్క్ను నేనెంతో గౌరవిస్తాను’ అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారుతోంది.
మరి రష్మిక అభిమానులు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఫర్హానా ప్రమోషన్స్ సందర్భంగా ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన ఈ నటి ఊహించని విధంగా ఈ వివాదంలో చిక్కుకుంది.