ఓటమి భయంతో.. సింగరేణి ఎన్నికలు వద్దంటున్రు : సలెంద్ర సత్యనారాయణ

ఓటమి భయంతో.. సింగరేణి ఎన్నికలు వద్దంటున్రు : సలెంద్ర సత్యనారాయణ

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీబీజీకేఎస్​ ఎన్నికలు వద్దంటోందని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ ఆరోపించారు. గురువారం మందమర్రి ఏరియా సింగరేణి వర్క్​షాప్​లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. హైకోర్టు తీర్పు మేరకు ఎన్నికలకు ఆర్ఎల్ సీ ఎన్నికల షెడ్యూల్​విడుదల చేస్తే మళ్లీ అడ్డుకునే కుట్రలు చేస్తున్నారన్నారు.

సింగరేణిలో కొత్త అండర్ గ్రౌండ్​ బొగ్గు గనులను తీసుకవస్తామని, లక్ష వరకు కార్మికుల సంఖ్యను పెంచుతామంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. సమావేశంలో యూనియన్​బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్​భీమనాథుని సుదర్శనం, లీడర్లు పెద్దపల్లి బానయ్య, పారిపెల్లి రాజేశం, రాజమౌళి, సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.