కార్మికులకు లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలె :సీతారామయ్య

కార్మికులకు లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలె :సీతారామయ్య
  • ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్ ​వాసిరెడ్డి సీతారామయ్య

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థకు గతేడాది వచ్చిన లాభాలను ప్రకటించి కార్మికులకు 35 శాతం వాటా ఇవ్వాలని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సోమవారం మందమర్రి ఏరియా కాసిపేట-1గనిపై నిర్వహించిన గేట్​మీటింగ్​లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎండీతో జరిగిన గత స్ట్రక్చర్​ మీటింగ్​లో కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాలని చేసిన డిమాండ్​కు యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని, కావాల్సిన భూమి కోసం సర్కార్​తో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. 

పెర్క్స్​పై ఇన్​కమ్​ ట్యాక్స్​యాజమాన్యమే చెల్లించాలని కోరామన్నారు. డిస్మిస్​ అయిన జేఎంఈటీలను తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవడానికి సర్క్యులర్ ​జారీ చేయించామన్నారు. డిస్మిస్​అయిన ఇతర ఉద్యోగులు ఐదేండ్లలో 100 మస్టర్లు ఉంటే తిరిగి ఉద్యోగంలో చేరేలా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లు,ఈపీ ఆపరేటర్లు మెడికల్​ ఇన్వాలిడేషన్​అయితే సూటబుల్​ జాబ్​ఇవ్వడం, ఖాళీగా ఉన్న క్లర్కులు, ఏరియా ఆసుపత్రి పారామెడికల్​ సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. గనుల్లో సేఫ్టీ మెటిరియల్​ అందించాలని, కాసిపేట గనిలో రెస్ట్​ హాల్, లాకర్ బాక్సులు ఏర్పాటు చేయాలన్నారు.

 ఈ సందర్భంగా పలువురు గని సూపర్​వైజర్లు ఏఐటీయూసీలో చేరారు. సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర సెక్రటరీ ఎండీ.అక్బర్​అలీ, బెల్లంపల్లి, మందమర్రి బ్రాంచీల సెక్రటరీలు దాగం మల్లేశ్, సలెంద్ర సత్యనారాయణ, ఇన్​చార్జి చిప్ప నర్సయ్య, బ్రాంచి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.