యూపీలోని 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఓడిపోతది : అఖిలేష్ యాదవ్

యూపీలోని 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఓడిపోతది : అఖిలేష్ యాదవ్

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో యుపీలో బీజేపీ ఓటమి తప్పదని అన్నారు. యూపీలోని 80 పార్లమెంట్‌ స్థానాల్లోనూ బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పారు. 50 ఏళ్లు అధికారంలో ఉంటామని చెప్పుకున్న బీజేపీ ప్రస్తుతం రోజులను లెక్కిస్తోందని విమర్శించారు. లండన్‌, న్యూయార్క్‌ల నుంచి పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారని, కానీ జిల్లాల నుండి పెట్టుబడులు తరలిస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. పోలీస్ కస్టడీలో మరణించిన బల్వంత్‌ సింగ్‌ కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం అందించాలని డిమాండ్ చేశారు. కస్టడీ మృతుల కుటుంబాలకు రూ. కోటి మరియు ప్రభుత్వం ఉద్యోగం అందించేలా ఓ తీర్మానాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆమోదించగలరా అని ప్రశ్నించారు. ఈ నెల 12, 13 తేదీల మధ్య బల్వంత్‌ సింగ అనే వ్యాపార వేత్త కాన్పూర్‌ పోలీస్‌ కస్టడీలో మరణించారు.