పేదలకు అఖిలేష్ హామీలు

పేదలకు అఖిలేష్ హామీలు

లక్నో: ఉత్తరప్రదేశ్​లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేండ్లపాటు పేదలకు ఫ్రీగా రేషన్​తో పాటు కిలో నెయ్యి పంపిణీ చేస్తామని సమాజ్​వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హామీ ఇచ్చారు. మంగళవారం రాయ్​బరేలిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘మునుపు పవర్​లో ఉన్నప్పుడు రేషన్ ఇచ్చినం. ఎస్పీ సర్కారు ఉన్నంతకాలం పేదలకు ఫ్రీగా రేషన్ ఇచ్చుడే ఉంటది. బంజేసుడు ఉండదు. దాంతోపాటు ఆవాల నూనె, ఏడాదికి రెండు సిలిండర్లు, పేదల ఆరోగ్యం మెరుగుపడేందుకు నెయ్యి కూడా ఇస్తం” అని అఖిలేశ్ అన్నారు. బీజేపీ హయాంలో ఈ ఎన్నికలదాకానే రేషన్ అందుతదని, ఆ తర్వాత ఇచ్చుడు ఆగిపోతుందని చెప్పారు. కేంద్ర బడ్జెట్​లో రేషన్​కు ఫండ్స్ కేటాయించకపోవుడే అందుకు ఉదాహరణ అని అఖిలేశ్​ చెప్పారు.