స్టేజ్ పై స్టెప్పులేసిన రామ్ చరణ్,అక్షయ్ కుమార్

స్టేజ్ పై స్టెప్పులేసిన రామ్ చరణ్,అక్షయ్ కుమార్

బాలీవుడ్, తెలుగు చిత్ర పరిశ్రమల్లో డిమాండ్ ఉన్న హీరోలు అక్షయ్ కుమార్, రామ్ చరణ్.. ఇటీవల న్యూఢిల్లీలో ఒకే స్టేజ్ పై కనిపించారు. నవంబర్ 12న రాజధానిలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2022 ఈవెంట్‌కి వీళ్లిద్దరు కలిసి గెస్ట్ గా వచ్చారు. ఈవెంట్ లో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతలా అభివృద్ధి చెందుతోందనేది వివరించాడు. రీసెంట్ టాలీవుడ్ హిట్ ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చాడు. చివరగా ‘ రాష్ట్రాలు దాటి భారతీయ చిత్ర పరిశ్రమంతా ఒక యూనిట్ గా మారిపోయింది. ఇప్పుడు దేశాలు దాటి వెళ్లే టైం వచ్చింది. ప్రపంచానికి మన సినిమా సత్తా చూపించాలి’ అని వ్యాఖ్యానించాడు.   

అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. తన రాబోయే సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. తన రీసెంట్ బాక్సాఫీస్ డిజాస్టర్ పృథ్వీరాజ్ సినిమా కేవలం 42 రోజుల్లోనే షూటింగ్ ఎలా పూర్తిచేసుకుందో వివరించాడు. తర్వాత ఇద్దరూ కలిసి స్టేజ్ పై స్టెప్పులేసి ప్రేక్షకుల్ని అలరించారు.