Akshay Kumar: వాటి వల్ల నా స్టైల్ మారదు.. అక్షయ్ కామెంట్స్కి ఫ్యాన్స్ ఫిదా

Akshay Kumar: వాటి వల్ల నా స్టైల్ మారదు.. అక్షయ్ కామెంట్స్కి ఫ్యాన్స్ ఫిదా

బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్(Akshay kumar), టైగర్ ష్రాఫ్(Tiger Shroff) కాంబోలో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan). స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్(Ali abbas Zafar) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రంజాన్ సందర్బంగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనులు మొదలుపెట్టిన మేకర్స్.. ఇందులో భాగంగా తాజాగా బడే మియా చోటే మియా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా హీరో అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియా సినిమా గురించి, తన గత చిత్రాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల నేను చేసిన సినిమాలేవి ప్రేక్షకులను, అభిమానులను అలరించలేకపోయాయి. కొన్ని సార్లు విజయం సాదించంవచ్చు, కొన్నిసార్లు పరాజయాన్ని చవిచూడవచ్చు. కానీ, నా ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. ఎందుకంటే.. ఇలాంటివి నాకేమి కొత్త కాదు. ఒకానొక సమయంలో వరుసగా 16 ప్లాప్స్ వచ్చాయి. అయినా కూడా నా నమ్మకాన్ని మాత్రం వదలలేదు. పరాజయాలవల్ల నా ప్రయాణాన్ని ఆపను. ఇపుడు బడే మియా చోటే మియా విషయంలో కూడా అదే జరుగుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. మంచి ఫలితాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాం అంటూ చెప్పు కొచ్చారు అక్షయ్ కుమార్.

ఇక అక్షయ్ చేసిన ఈ కామెంట్స్ కి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు ఇప్పటికే ఓడిపోరని, వెనుక కామెంట్స్ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, బడే మియా చోటే మియా సినిమా ఖచ్చితంగా భారీ విజయం సాదిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. మరి అక్షయ్ కుమార్, ఆయన ఫ్యాన్స్ కూడా చాలా ఆశలు పెట్టుకున్న బడే మియా చోటే మియా సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.