ఘనంగా దత్తన్న అలయ్ బలయ్

ఘనంగా దత్తన్న అలయ్ బలయ్

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్.. బలయ్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానించారు. సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 2005 నుంచి ఏటా దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈఏడాది ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్, మెగా స్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, బీజేపీ నేతలు రాంచందర్ రావు, కపిలవాయి దిలీప్ కుమార్, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, సీపీఐ నేతలు నారాయణ,  చాడ వెంకట్ రెడ్డి, రామకృష్ణ, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా అతిథులకు బండారు విజయలక్ష్మి స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అద్దంపట్టే రీతిలో కళాకారులు ఆట పాటలతో సందడి చేశారు.