- మూడోసారి గెలవాలని మల్లు రవి ప్రయత్నం
- మోదీ ఛరిష్మాపై బీజేపీ అభ్యర్థి భరత్ ఆశలు
- బోణీ కొట్టాలని బీఆర్ఎస్ క్యాండిడేట్ ప్రవీణ్ తాపత్రయం
- కారును కలవరపెడుతున్నకాంగ్రెస్ లీడ్
నాగర్కర్నూల్, వెలుగు :నాగర్కర్నూల్, వెలుగు : నాగర్ కర్నూల్ లోక్సభ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు శ్రమిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్ల శాతం, కీలక నేతల చేరికలతో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థి మల్లు రవి గెలుపు తనదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ప్రసాద్ సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకుగా, తాను స్థానికుడైనందున ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నారు. కుదరని పొత్తుల బేరంతో బీఎస్పీని వీడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్అనూహ్యంగా బీఆర్ఎస్అభ్యర్థిగా నాగర్కర్నూల్ నుంచి పోటీలో ఉండడం చర్చనీయాంశంగా మారింది.
ఇక బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉంటానని నామినేషన్ వేసిన సీనియర్ లీడర్, మాజీ ఎంపీ డా.మంద జగన్నాథం బీఫారం సమర్పించకుండానే నాకౌట్దశలోనే అనర్హుడయ్యారు. జగన్నాథం చీల్చే ఓట్ల ప్రభావం ఎవరి మీద ఉంటుందో అని మూడు పార్టీల అభ్యర్థులు కొంత టెన్షన్పడ్డా ఇప్పుడు రిలాక్స్ అయ్యారు. బీఎస్పీ అభ్యర్థి యోసేఫ్, సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బర్రెలక్క అలియాస్శిరీష, ఇతర ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నా గెలుపోటముల నిర్ణయించే స్థాయిలో వారి ప్రభావం ఉండదంటున్నారు.
ఐదు స్థానాల్లో గెలిచి జోష్ మీదున్న కాంగ్రెస్
నాగర్కర్నూల్పార్లమెంట్నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా కొల్లాపూర్, వనపర్తి, నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తిల్లో కాంగ్రెస్విజయం సాధించింది. బీఆర్ఎస్ గద్వాల, అలంపూర్స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ రెండు చోట్లా బీఆర్ఎస్ ఎమెల్యేలు గెలిచారన్న సంతోషం కూడా మిగలకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఆ పార్టీని షాక్కు గురి చేసింది. మరోవైపు అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లక్ష వరకు మెజార్టీ సాధించడంతో పాటు సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావడంతో గెలుపు కోసం స్థానిక కాంగ్రెస్ లీడర్లు శ్రమిస్తున్నారు.
మంత్రి జూపల్లికి నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంతో గెలుపు కోసం ఆయన కష్టపడుతున్నారు. 2019 పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డా.మల్లు రవి ఓటమిపాలైనా 1991,1998లో రెండు సార్లు గెలిచారు. జడ్చర్ల నియోజకవర్గానికి షిప్ట్ అయినా నాగర్కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, క్యాడర్తో ఆయన సంబంధాలు వీడలేదు. ఈ పరిచయాలు తన విజయానికి తోడ్పడతాయని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, అగ్రనేత రాహుల్గాంధీ సభల్లో పాల్గొనడం, రేవంత్రెడ్డి ప్రచారం కలిసి వస్తాయని మల్లు రవి నమ్ముతున్నారు.
లోకల్ స్లోగన్, మోదీ హవాపై ఆశలు...
అచ్చంపేట నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన రాములుకు నాగర్కర్నూల్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిచయాలున్నాయి. బీఆర్ఎస్ బాసులు కేసీఆర్, కేటీఆర్ తనను చిన్నచూపు చూశారన్న బాధతో ఆయన బీజేపీలో చేరారు. ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ బంగారు శ్రుతిని కాదని కొడుకు భరత్కు టికెట్ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు.
ప్రధాని మోదీ నాగర్ కర్నూల్బహిరంగ సభతో క్యాడర్లో మరింత జోష్ పెరిగింది. గుజరాత్ సీఎం, కేంద్రమంత్రులు కూడా ప్రచారానికి రావడం ప్లస్ పాయింట్స్. ప్రధాని మోదీ ఛరిష్మా, ఆయోధ్య రామమందిరం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విజయాలు తనను గెలిపిస్తాయని భరత్ప్రసాద్ నమ్మకంగా ఉన్నారు. ఆ పార్టీ ముఖ్య లీడర్లు ఎల్లేని సుధాకర్ రావు, టి.ఆచారి, జక్కా రఘునందన్ రెడ్డి,లోక్నాథ్రెడ్డిలకు ఈ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. 2019 పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీ 1,29,021 ఓట్లు సాధించగా, ఇప్పుడు విజయానికి అవసరమైన ఓట్లను సాధించడం కోసం కష్టపడుతున్నారు.
ఎంపీగా అయినా గెలవాలని..
సిర్పూర్ టి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ..మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూనే ముందుకు పోతున్నారు. గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏర్పాటైన పూర్వ విద్యార్థుల ఫోర్స్అయిన స్వేరోస్ను రంగంలోకి దించారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం, అచ్చంపేట, నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాల రాజు, మర్రి జనార్దన్రెడ్డి ప్రచారంలో సీరియస్గా పాల్గొనడం కలిసి వస్తుందని ఆర్ఎస్పీ భావిస్తున్నారు.
కల్వకుర్తి, వనపర్తి నియోజకవర్గాల్లో ప్రచారం పుంజుకోకపోయినా పోలింగ్ వరకు సర్దుకుంటుందని అనుకుంటున్నారు. నిన్న మొన్నటివరకు డల్గా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్లో కేసీఆర్ రోడ్ షోతో కాస్త జోష్ పెరిగింది. ప్రచారంలో లోకల్ ఇష్యూస్తో పాటు రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ఆర్ఎస్పీ ప్రస్తావిస్తున్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, మల్లు రవి స్థానికేతరుడని, తనను పార్లమెంట్కు పంపిస్తే నిలదీసి కొట్లాడుతా అంటూ వాగ్దానం చేస్తున్నారు.
లెక్క రిపీటైతే బీఆర్ఎస్కు కష్టమే
2019 పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరులో టీఆర్ఎస్అభ్యర్థి, సిట్టింగ్ఎంపీ పోతుగంటి రాములు 1,89,668 ఓట్ల మెజారిటీ సాధించారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే సరికి టోటల్ సీన్ రివర్సయ్యింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 6,39,628 ఓట్లు సాధించి ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. బీఆర్ఎస్ మాత్రం 5,34,401 ఓట్లతో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య 11.8 శాతం ఓట్ల తేడా ఉంది. ఈ లెక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అయితే బీఆర్ఎస్కు కష్టకాలమే..