జెమీమా ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షో..రెండో వన్డేలో బంగ్లాపై ఇండియా ఘన విజయం

జెమీమా ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షో..రెండో వన్డేలో బంగ్లాపై ఇండియా ఘన విజయం

మీర్పూర్‌‌‌‌: సిరీస్‌‌‌‌లో నిలవాలంటే కచ్చితంగాగెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్ సత్తా చాటింది. యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌ (86; 4/3) ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌తో బుధవారం జరిగిన రెండో వన్డేల్లో ఇండియా 108 రన్స్‌‌‌‌ తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌ను చిత్తు చేసింది. మూడు వన్డేల సిరీస్‌‌‌‌ను 1–1తో సమం చేసింది. టాస్‌‌‌‌ ఓడిన ఇండియా మొదట 50 ఓవర్లలో 228/8 స్కోరు చేసింది. బర్త్‌‌‌‌డే గర్ల్‌‌‌‌ స్మృతి మంధాన (36) రాణించినా ప్రియా పునియా (7), యాస్తికా భాటియా (15) ఫెయిలయ్యారు. అయితే,  జెమీమాతో పాటు హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ (52) ఫిఫ్టీతో ఇండియా మంచి స్కోరు చేసింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతున్‌‌‌‌, నమీదా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌కు వచ్చిన బంగ్లా 35.1 ఓవర్లలో 120 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. ఫర్గానా హక్‌‌‌‌ (47) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. జెమీమా, దేవికా వైద్యా (3/30) దెబ్బకు మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టారు. జెమీమాకు ప్లేయర్ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు లభించింది. సిరీస్‌‌‌‌ విన్నర్‌‌‌‌ను తేల్చే మూడో, చివరి వన్డే శనివారం జరుగుతుంది.