ప్రాజెక్టులకు జలకళ

ప్రాజెక్టులకు జలకళ

ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. అధికారులు 17 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్ ఫ్లో  2 లక్షల 18 వేల 135 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో లక్షా 71 వేల 830 క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18 టీఎంసీలు నిల్వ చేశారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. ఇన్ ఫ్లో 2 వేల 214 క్యూసెక్కులుగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడి వాగు ప్రాజెక్టు, సాత్నాల ప్రాజెక్టులు కూడా నిండిపోయాయి.