సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి

 సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన  ఆళ్ల రామకృష్ణా రెడ్డి

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.  2024 ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యలయంలో  జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ ఆయనకు పార్లీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వ్యక్తిగత  కారణాలతో గతేడాది డిసెంబర్ లో వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.  

కానీ ఆయన రాజీనామాపై స్పీకర్  ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ఆళ్ల .. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్  షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  నెల రోజుల వ్యవధిలో తిరిగి వైసీపీలో జాయిన్ అయ్యారు ఆళ్ల.  

వైసీపీ ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళగిరి టికెట్ ఎవరికి దక్కుతుంది అనేది ఉత్కంఠగా మారింది.  కాగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి 2014, 19 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు.  

Also Read :విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవు