Allu Sneha Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..అల్లు స్నేహా, నటి ప్రగతి

Allu Sneha Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..అల్లు స్నేహా, నటి ప్రగతి

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే అల్లు అర్జున్(Allu Arjun..Sneha Reddy) స్నేహారెడ్డి అనడంలో సందేహం లేదు. స్టార్ అల్లు అర్జున్ వరుస మూవీస్ తో బిజీయెస్ట్ స్టార్ అయినప్పటికీ..తన ఫ్యామిలీ కోసం స్పెషల్ టైం కేటాయిస్తారు. అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పిల్లల గురించి, అల్లు అర్జున్ సినిమాల విశేషాలను ఐకాన్ ఫ్యాన్స్తో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటది.

అల్లు స్నేహా రెడ్డి (సోమవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఒక్కరే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్నేహా రెడ్డికి తిరుమల ఆలయ అధికారులు స్వాగతం పలికి..స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వేద పండితులు ఆమెను ఆశీర్వదించి..ఆ తర్వాత తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అలాగే ..అల్లు స్నేహారెడ్డితో  పాటు తిరుమలలో ఓ బేబీ, అలా మొదలైంది సినిమాల డైరెక్టర్ నందిని రెడ్డి, నటి ప్రగతి కూడా కనిపించారు. వీరికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, వీరు ఇద్దరు అల్లు స్నేహరెడ్డితో పాటు కలిసి వెళ్ళారా? లేదా ఎవ్వరికీ వారుగా వెళ్ళారా అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్గా నటి ప్రగతి జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో సత్తా చాటి కాంస్యం కైవసం చేసుకుంది. అందుకోసమే ప్రగతి తిరుమల వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్గా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..సందీప్ రెడ్డి వంగా, అట్లీతోనూ మూవీస్ చేయాడానికి రెడీ అయ్యాడు. ఇలా బన్నీ ఓ పక్క యాడ్స్ చేస్తూనే మరో పక్క పుష్ప రెండో పార్టును కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.