ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఎవరైనా సరే.. ఎన్టీఆర్పై అల్లు శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఎవరైనా సరే.. ఎన్టీఆర్పై అల్లు శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్టీఆర్(Ntr) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్(RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత ఆయన రేంజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఎంతలా అంటే.. బాలీవుడ్ స్టార్ మేకర్స్ సైతం ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమయ్యేంతలా. 

కేవలం సినిమాలే కాదు.. టాలీవుడ్ లో ఇతర హీరోలతో కూడా చాలా ప్రేమగా ఉంటారు ఎన్టీఆర్. ఇదే విషయాన్నీ చాలా మంది హీరోస్ కూడా ఇప్పటికి చాలాసార్లు చెప్పారు. ఇక మెగా ఫ్యామిలీతో కూడా ఎన్టీఆర్ కి మంచి రిలేషన్ ఉంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య ఉన్న ఆ బాండింగ్ వేరు. ఒకరిని ఒకరు బావ అని పిలుచుకుంటూ.. సోషల్ మీడియాలో బలే సందడి చేస్తుంటారు ఈ స్టార్స్.

ఇక తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యింది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దివాళీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి టాలీవుడ్ నుండి టాప్ స్టార్స్ అందరు హాజరయ్యారు. అందులో వెంకటేష్, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు తోపాటు చాలామంది ప్రముఖులు సందడి చేశారు. .

ఇందులో భాగంగా.. అల్లు శిరీష్ ఎన్టీఆర్ తో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్.. ఇలా ఎవరు ఎప్పుడు తనతో ఒక ఫోటో అడిగినా.. అందరితో ఒకేలా ఉంటారు, ప్రేమతో ఫోటో ఇస్తారు తారక్ అన్న. చాలా ప్రేమ ఉన్న మనిషి తారక్ అన్న.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు అల్లు శిరీష్. దీంతో ఆ ఫోటో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. మీరు ఎప్పటికీ ఇలాగే కలిసుండాలి అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.