జనవరి13న అమాగి మీడియా ఐపీఓ

జనవరి13న అమాగి మీడియా ఐపీఓ

న్యూఢిల్లీ: సాఫ్ట్​వేర్ ​యాజ్​సర్వీస్​(సాస్) సేవలు అందించే  బెంగళూరు కంపెనీ అమాగి మీడియా ల్యాబ్స్ ఐపీఓ ఈ నెల 13–16 తేదీల్లో ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,788 కోట్లు సేకరించాలని భావిస్తోంది.  ధరల శ్రేణిని రూ.343 నుంచి రూ.361 గా  నిర్ణయించింది.

 ఐపీఓలో రూ.816 కోట్ల విలువైన కొత్త షేర్లు, 2.7 కోట్ల షేర్ల ఓఎఫ్​ఎస్​ ఉన్నాయి. సమీకరించిన నిధుల్లో రూ.550 కోట్లను టెక్నాలజీ, క్లౌడ్ మౌలిక సదుపాయాల బలోపేతం కోసం వినియోగిస్తారు.  కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.1,162 కోట్ల ఆదాయం సాధించింది.