- ఇవాళ అర్ధరాత్రి ప్రారంభం
న్యూఢిల్లీ : అమెజాన్ యూజర్లకు మళ్లీ డిస్కౌంట్ల పండగ మొదలైంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి అమెజాన్ ‘ప్రైమ్ డే’ ప్రారంభం కానుంది. ఈ ప్రైమ్ డేలో కస్టమర్లకు భారీగా డిస్కౌంట్లను, వందల కొద్దీ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్లను, కొత్త లాంఛ్లను, క్యాష్బ్యాక్ ఆఫర్లను ప్రవేశపెడుతోంది. కరోనా వైరస్ అవుట్బ్రేక్ తర్వాత తొలిసారి అమెజాన్ ‘ప్రైమ్ డే’ను నిర్వహిస్తోంది.అంతకుముందు లాగా కాకుండా వర్చ్యువల్గా అమెజాన్ ఆపరేషన్స్ను చేపట్టనుంది. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో, వారి ఇళ్ల నుంచే ఈ సేల్ను కోఆర్డినేట్ చేయనున్నారు. ప్యాకర్స్, డెలివరీమెన్ విషయంలో అన్ని రకాల హైజీన్ ప్రోటోకాల్స్ను అమెజాన్ పాటించనుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్కు ఎమర్జెన్సీగా అవసరమైన అన్ని రకాల ప్రొడక్ట్లపై డిస్కౌంట్లను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు పలు ప్రొడక్ట్లను ఉచితంగా డెలివరీ చేయనుంది. అంతేకాక పలు ఆఫర్లను వారికి అందుబాటులోకి తెచ్చింది. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత స్మార్ట్ఫోన్ సేల్స్ పెరిగాయి. దీంతో ఈ ప్రైమ్డేలో స్మార్ట్ఫోన్లు, ఇతర యాక్ససరీస్పై పలు డీల్స్ను ప్రకటించింది. ఈ మేరకు వన్ప్లస్ నార్డ్, రెడ్మీ ప్రైమ్, రెడ్మీ నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్, హానర్ 9ఏ, రెడ్మీ నోట్ 9ప్రో, రెడ్మీ నోట్ 9, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ తదితర స్మార్ట్ ఫోన్లపై ఫ్లాష్ సేల్స్ ఉన్నాయి. అన్ని టాప్ బ్రాండ్ మొబైల్స్పై దాదాపు 40శాతం ఆఫ్ ఉంది. ఎలక్ట్రానిక్ అండ్ యాక్ససరీస్పై 60 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించారు. కెమరాస్ అండ్ యాక్సిసరీస్, హెడ్ ఫోన్స్పై 70 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చారు. ల్యాప్టాప్స్, ఫిటన్నెస్ ట్రాకర్స్పైన కూడా డిస్కౌంట్ ఇచ్చారు.