ఆలోచింపజేసేలా అంబాజీపేట బ్యాండు

ఆలోచింపజేసేలా అంబాజీపేట బ్యాండు

సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. శివాని నాగరం హీరోయిన్‌‌. జీఏ2 పిక్చర్స్‌‌తో కలిసి వెంకటేష్ మహా, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ లాంచ్‌‌ ఈవెంట్‌‌ ప్రసాద్ ల్యాబ్స్‌‌లో జరిగింది. దర్శకులు మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేష్, సందీప్ రాజ్, నిర్మాత ఎస్‌‌కేఎన్ అతిథులుగా హాజరయ్యారు. 

మారుతి మాట్లాడుతూ ‘ఈ టైటిల్‌‌తో నేటివిటీ టచ్ చేశారు. టీజర్ చాలా బాగుంది. రీసెంట్‌‌గా సినిమా కూడా చూశాను. మన మధ్య జరిగే కథలాగ ఉంటుంది. సుహాస్‌‌కి ఈ సినిమా ట్రేడ్ మార్క్‌‌గా నిలుస్తుంది’ అన్నారు. ఈ జనరేషన్‌‌ను ఆలోచింపజేసేలా  సినిమా ఉంటుందని చెప్పాడు మరో దర్శకుడు సాయి రాజేష్. అతిథులంతా సినిమా సక్సెస్ కావాలని బెస్ట్ విషెస్ తెలియజేశారు. తన కెరీర్‌‌‌‌లో ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుంది అని చెప్పాడు సుహాస్.  జీఏ2 పిక్చర్స్‌‌లో మూవీ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు దర్శకుడు దుశ్యంత్, హీరోయిన్ శివాని సంతోషం వ్యక్తం చేశారు.  టీమ్ అంతా పాల్గొన్నారు.