- మొదటి సంవత్సరం పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు
- రెండో సంవత్సరం పరీక్షలు జనవరి 18 నుంచి 24 వరకు
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ సెకండియర్ ఎగ్జామ్స్ జనవరి 18 నుంచి 24 వరకు ఉంటాయని వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫస్టియర్ ఎగ్జామ్స్ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరుగుతాయన్నారు. ఎగ్జామ్టైమ్మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్షలకు అటెండ్ అవ్వాలనుకునే స్టూడెంట్లు www.braouonline.in పోర్టల్లో నమోదు చేసుకోవాలని, అనంతరం ఆన్లైన్ సెంటర్ల ద్వారా ఫీజు చెల్లించాలని కోరారు. ఆన్లైన్ రిజిస్ర్టేషన్లకు ఈ నెల 23 చివరి తేదీ అని పేర్కొన్నారు.